ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్ నడుస్తోంది.
భారత్ ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. శ్రీలంక
క్రికెట్ బోర్డు విడుదల చేసిన తేదీల ప్రకారం, తొలి టెస్టు ఆగస్టు 15-19 వరకు గాలెలో, రెండో టెస్టు ఆగస్టు 23-27 వరకు కొలంబోలో జరగనుంది. ఉదయం 10 గంటలకు ఆట ప్రారంభమవుతుంది. WTC పాయింట్ల పట్టికలో
భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో (48.15 శాతం) ఉంది. ఫైనల్కు చేరాలంటే టాప్-2లో ఉండాలి, కాబట్టి ఈ సిరీస్ భారత్కు అత్యంత కీలకం.