భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. ఈ ఘనతతో తైవాన్, దక్షిణ కొరియాలను వెనక్కి నెట్టింది. జూన్ నెలలో అనేక అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోగా, భారత మార్కెట్ క్యాప్ 2.75% పెరిగింది. ప్రస్తుతం
భారత్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లు కాగా, తైవాన్ 4.97 ట్రిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా 4.66 ట్రిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.