సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒమన్ తీరంలో భారత నావికుడు మృతి చెందినట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్
ఇండియా వెల్లడించింది. ఒమన్ తీరంలో ఉన్న ‘ఎంటీ సెలెస్టియల్’ నౌక సెకండ్ ఆఫీసర్ నిశాంత్ (35) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో ఫలితంగా వైద్యం అందక గురువారం నిశాంత్ మరణించారు. మృతుడు తమిళనాడుకు చెందినవారు.