భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన టర్కీ, అజర్బైజాన్లకు భారతీయ పర్యాటకులు గట్టి బుద్ధి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు మద్దతు పలికిన ఈ దేశాల పర్యాటక వ్యాపారాలు కుప్పకూలాయి. నివేదికల ప్రకారం, జూన్ నుండి డిసెంబర్ 2024 మధ్య అజర్బైజాన్కు వెళ్లే భారతీయ సందర్శకుల సంఖ్య 63% తగ్గింది. టర్కీకి వెళ్లే వారి సంఖ్య 34% తగ్గింది. గత సంవత్సరం ఇదే కాలంలో అజర్బైజాన్ను 153,000 మంది భారతీయులు సందర్శించగా, ఈ సంవత్సరం అది 57,000కి పడిపోయింది. టర్కీ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.