జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్లో జరగనున్న ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత మహిళల
క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల
టీ20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, సీనియర్ ప్లేయర్ హర్మన్ప్రీత్ కౌర్నే కెప్టెన్గా కొనసాగిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. గత ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టు, ఈసారి కూడా టైటిల్ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.