న్యూజిలాండ్లో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, వ్యాపారవేత్తగా చలామణి అవుతున్న బల్తేజ్ సింగ్కు 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇతను భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన సత్వంత్ సింగ్కు బంధువని దర్యాప్తులో తేలింది. బీర్ క్యాన్లలో డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేసే ఈ నెట్వర్క్ను 2023లో ఒక వ్యక్తి మరణంతో గుర్తించారు. తన కుటుంబ నేపథ్యం వల్ల ముప్పు ఉంటుందని బల్తేజ్ సింగ్ పేరును వెల్లడించవద్దని కోరినా, కోర్టు తిరస్కరించింది.