విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడి, తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు వెళ్లింది. ఇంటర్ పరీక్షలు రాసిన తర్వాత ఫ్రీ బస్లో కావలికి చేరుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి ఆమెను గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పిల్లలను గమనించాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు.