విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో విచారణ వేగవంతమైంది. ఐదుగురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను విజయవాడకు తరలించిన పోలీసులు, జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుల నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించింది, మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.