AP: రాష్ట్ర ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 సంవత్సరం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని, సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ. 15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు.