ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్తో జియోస్టార్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భాగస్వామ్య పక్షం చెల్లింపుల్లో విఫలమవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఆ నిషేధంపై పునరాలోచిస్తామని సంకేతాలు ఇచ్చినప్పటికీ, జియోస్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ రద్దుతో 2027 వరకు టీస్పోర్ట్స్ కు ఉన్న ఐపీఎల్ ప్రసార అనుమతులు రద్దయ్యాయి. ఇది బంగ్లాదేశ్లో ఐపీఎల్ వీక్షకుల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపనుంది.