అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ఇరాన్ నుంచి ముడి చమురును కొనుగోలు చేయడానికి భారత రిఫైనరీలు ఆసక్తి చూపుతున్నాయి. మార్చి 4న ఖర్గ్ ద్వీపం నుంచి లోడ్ అయిన ఓ ఆయిల్ ట్యాంకర్, ఏప్రిల్ 4న గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకోనుంది. 2019 తర్వాత ఇరాన్ నుంచి భారత్కు ఇది తొలి చమురు దిగుమతి కానుంది. సుమారు 6,00,000 బ్యారెళ్ల చమురుతో వస్తున్న ఈ ట్యాంకర్ను ఏ రిఫైనరీ వినియోగించనుందనేది ఇంకా తెలియరాలేదు.