యూపీలోని ముజఫర్నగర్లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. బైక్పై వెళ్తున్న యువకుడు, యువతిని ఓవర్లోడ్తో ఉన్న డంపర్ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ వారికి ప్రాణాపాయం తప్పింది. ఒక్క క్షణంలో చావు అంచు నుంచి తప్పించుకున్న ఆ వీడియో దగ్గరలోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రమాద తీవ్రతను చూసిన నెటిజన్లు షాక్కి గురవుతున్నారు.