మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదంపై దర్యాప్తులో కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విమానంలో శాటిలైట్ ఆధారిత భద్రతా వ్యవస్థ ‘గగన్’ లేకపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానాల్లో గగన్ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలనే నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం 28 రోజుల ముందే ఈ విమానం రిజిస్ట్రేషన్ అయినట్లు సమాచారం. దీంతో ప్రమాదానికి ఇది కూడా కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.