RCBపై కేవలం 38 బంతుల్లో 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఐపీఎల్లో 3,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. 120 మ్యాచ్లలో 113 ఇన్నింగ్స్లలో 3,078 పరుగులు సాధించిన అతను, అత్యంత తక్కువ బంతుల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా, నాల్గవ వికెట్ కీపర్గా నిలిచాడు. 2180 బంతుల్లో ఈ ఘనత సాధించిన కిషన్, కేఎల్ రాహుల్ను అధిగమించాడు. రిషబ్ పంత్, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనా, ధోనీ ఈ జాబితాలో ముందున్నారు.