వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పెరుగు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అయితే కొన్ని పదార్థాలతో పెరుగు కలపడం వల్ల జీర్ణక్రియ బలహీనపడి, శరీరంలో విషపదార్థాలు పెరిగి, దీర్ఘకాలంలో వ్యాధులు రావచ్చని ఆయుర్వేదం వివరిస్తోంది. ముఖ్యంగా ఉల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, కాకరకాయ వంటి వాటితో పెరుగును కలిపి తినడం వల్ల చర్మ అలెర్జీలు, దురద, జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు. కఫం పెరగడం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.