AP: సీఎం చంద్రబాబును బూతులు తిట్టడం తన ఉద్దేశం కాదని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తనను బూతులు తిట్టిన వారిపై తాను అదే రీతిలో స్పందించానని, చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. “దమ్ముంటే చంద్రబాబును రమ్మని అన్నాను తప్పా, ఆయనను దూషించలేదు” అని అంబటి రాంబాబు తెలిపారు. తన మాటలను వక్రీకరిస్తూ రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.