AP:
వైసీపీ అధినేత
జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో "మావిగన్ Vs అమరావతి" అజెండాతో ముందుకు వెళ్తామని చేసిన వ్యాఖ్యలపై
టీడీపీ అధికారికంగా స్పందించింది. రాజధాని విషయంలో
జగన్ పదేపదే యూటర్న్ లు తీసుకుంటున్నారని
టీడీపీ విమర్శించింది. 2019లో అమరావతి, 2024లో మూడు రాజధానులు, 2029కి మావిగన్ అని చెబుతున్న
జగన్, రాబోయే రోజుల్లో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ను రాజధానిగా ప్రకటిస్తారని
టీడీపీ సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించింది.