AP: అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నందునే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సొంత మీడియాతో మాట్లాడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా జగన్ పనికిరారని ప్రజలు ఆయన్ను పక్కన పెట్టారన్నారు.