AP: వైసీపీ నేతలు జగన్ మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిని ఓర్చుకోలేని జగన్, రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. "ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ధైర్యం ఉంటే చర్చకు రండి" అని సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.