AP: ‘రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే. సీమకు జగన్ చేసింది ఏమీ లేదు. ఆయన సీమ బిడ్డ కాదు... క్యాన్సర్ గడ్డ’ అని టీడీపీ సీనియర్ నాయకుడు బీటెక్ రవి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రాధామ్యాలు ఎంత చిత్రంగా ఉంటాయో చెప్పేందుకు రుషికొండ ప్యాలెస్, భోగాపురం ఎయిర్పోర్టు నిదర్శనమని ఎద్దేవా చేశారు.