AP: వైసీపీ అధినేత జగన్ కృష్ణా జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరారు. ప్రస్తుతం విజయవాడ పడమటకు చేరుకున్నారు. జగన్ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మహిళలు గుమ్మడి కాయలతో జగన్ దిష్టి తీశారు. జగన్పై పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. రోడ్డు మీద ఉండొద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు.