AP: వైసీపీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు వైఎస్ జగన్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్, పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావు ఈ ఆఫర్కు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.