వైఎస్ఆర్ చేసిన కీలక సంస్కరణలు, జగన్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం మీడియా ఎదుట ఆరోపించారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి దాదాపు రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పరిచారని తెలిపారు. మెరుగైన విద్య కోసం అమలు చేసిన విద్యాదీవెన, వసతి దీవెనలను కూడా ఎత్తివేశారని చెప్పారు. జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరంగా మార్చారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు.