AP: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ నేతలు డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గోపువానిపాలెంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్, వైసీపీ కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అనిల్ కుమార్కు చెప్పగా.. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.