AP: వైసీపీ అధినేత జగన్ మద్యాన్ని దూరం చేసి ప్రజల ప్రాణాలు కాపాడారని మాజీ మంత్రి రోజా అన్నారు. ఆదివారం నగరిలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు తొలగించామన్నారు. మద్యం దుకాణాలను మూసివేశామన్నారు. కానీ టీడీపీ నేతలు బందిపోట్లు కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ప్రజలను దోచుకోవడానికి నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తోందో ప్రజలు గమనించాలన్నారు.