జగన్ రుషికొండను మింగేసి ప్యాలెస్లు కట్టారు: షర్మిల ఆరోపణ
By N Shiva Kumar 4379చూసినవారుమూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి జగన్ సొంతంగా ప్యాలెస్లు కట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు. అమరావతి రాజధానిపై జగన్ వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్సార్ పేరు వాడుకుంటున్నారని, ఆయన ఆశయాలకు జగన్ వారసులు కాలేదని, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా ఎందుకు మారారని ప్రశ్నించారు. ఎస్సీలు, క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారని నిలదీశారు.