రాజ్యసభలో నటుడు, ఎంపీ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. “జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్… వస్తున్నాయ్… నేను ఏం చెబుతున్నానో తెలుగువాళ్లకు అర్థమవుతుంది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని, ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా కొనసాగలేదని స్పష్టం చేశారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు అధికార పార్టీని ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చకు తెరలేపారు.