AP: పోలవరం జనసేనలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు పైకి ఎక్కి నియోజకవర్గంలో దొరల పాలన పోవాలనడం చర్చనీయాంశంగా మారింది. చిర్రి బాలరాజుకు, ఆయనకు టికెట్ ఇప్పించిన కాపు నేత కరాటం రాంబాబు వర్గానికి మధ్య పలు విషయాల్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాంబాబు వర్గం సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఇవ్వట్లేదని చిర్రి బాలరాజు మండిపడుతున్నారు.