AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్కు మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో అవకతవకల్లో జోగి రమేశ్ పాత్ర ఉందని సీఐడీ అధికారులు గుర్తించారు. పెడనలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లలోనూ ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారాల్లోనూ కేసు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.