ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. జస్టిస్ బట్టు దేవానంద్ నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ఏపీ నుంచే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లిన ఆయన మళ్లీ ఏపీ హైకోర్టుకే నియమితులయ్యారు. జస్టిస్ బట్టు దేవానంద్ స్వస్థలం గుడివాడ. ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి బీఎల్ డిగ్రీ పొందారు. 1989లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.