శుక్రవారం బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం చిన్నరాచపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దగ్గుల అంజిరెడ్డి(55) వరి మడిలో ట్రాక్టర్ తో దున్నుతుండగా, అది ఇరుక్కుపోయింది. ట్రాక్టర్ ను బయటకు తీసే ప్రయత్నంలో, ఆయన ట్రాక్టర్ మరియు పవర్ ట్రిల్లర్ కింద పడి మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.