బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో కాలనీ మెయిన్ రోడ్డు నుంచి మహమ్మద్ కాలనీ మీదుగా భాకరాపేట చెరువు వరకు నిర్మిస్తున్న వర్షపు నీరు, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను ఆదివారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. గతంలో చిన్నపాటి వర్షానికే నీరు ఇళ్లల్లోకి చేరేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కాలువ పూర్తయితే ప్రజల డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుందని, ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.