కాశినాయన: భర్తకు భార్య పిల్లల అప్పగింత

బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం సావిశెట్టి పల్లెకు చెందిన బాలసుబ్బారెడ్డి భార్య మమత, తన ఇద్దరు పిల్లలతో కలిసి గత డిసెంబర్ 28న భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్యాపిల్లల ఆచూకీ తెలపాలని బాలసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ యోగేంద్ర కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, చివరికి బుధవారం నరసాపురంలోని పోలీస్ స్టేషన్లో మమతను, ఆమె పిల్లలను భర్త బాలసుబ్బారెడ్డికి అప్పగించారు.
