జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరుకు చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరూ టెన్త్లో ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. తల్లి యశోద 8వ తరగతి వరకు చదివి, పెళ్లి తర్వాత చదువు ఆపేసినా, చదవాలనే కోరికతో ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరై 299 మార్కులు సాధించారు. అదే సమయంలో కుమార్తె మానస ప్రైవేట్ పాఠశాలలో చదివి టెన్త్ పరీక్షలో 390 మార్కులు సాధించి పాస్ అయ్యారు.