ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సూచించారు. బుధవారం బద్వేలులోని పూసలవాడ, వెంకటయ్య నగర్లో ఎన్యుమరేటర్లు చేపట్టిన జనగణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, గృహాల లెక్కింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు.