కడప నగరంలోని రవీంద్రనగర్ యూఎస్ మహల్ కళ్యాణ మండపంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూతన ఓట్ల చేరికలు, తొలగింపులపై బూత్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్, రాష్ట్ర స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ప్రతి ఓటును జాగ్రత్తగా మ్యాపింగ్ చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు కీలకమని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.