మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం కడపలో జానుమద్ది హనుమత్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కడప చేరుకుని, రాత్రికి అక్కడే బస చేసి, 2వ తేదీ ఉదయం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం చెన్నైకు విమానంలో బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు.