కడప శాస్త్రి నగర్లో ఐపీఎల్ బెట్టింగ్ స్థావరంపై తాలూకా పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ ఆదేశాల మేరకు ప్రధాన నిందితుడు జనార్ధన్ రెడ్డితో సహా పలువురిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ. 7,00,550 నగదు, 5 మొబైల్స్, ల్యాప్టాప్, రూ. లక్ష విలువైన 12 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు.