కడప నగరపాలక సంస్థ పరిధిలోని రవీంద్రనగర్లో స్వచ్ఛ సర్వేక్షన్ పనులను అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర పర్యవేక్షించారు. నగర పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి కార్మికుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన కార్మికులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి, సిబ్బంది సమన్వయంతో సాగాలని ఆదేశించారు.