కడప నగరంలో బుధవారం సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షం వల్ల ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు శివాలయాలకు వెళ్లి కార్తీక దీపం వెలిగించడంలో కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి.