కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర బుధవారం 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉకాయపల్లి జీటీఎస్లో చెత్త తరలింపు, నిర్వహణను సమీక్షించి, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని, పారిశుధ్యంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.