పిఆర్సీ, డిఏ, సీపీఎస్ హామీల అమలులో కూటమి సర్కార్ విఫలమైందని యుటిఎఫ్ నేతలు మదన విజయకుమార్, మహేష్ బాబు కడపలో విమర్శించారు. గత ప్రభుత్వ విధానాలనే వీరు అమలు చేస్తున్నారని ఆరోపించారు. సమస్యల సాధన కోసం డిసెంబర్ 21న మైదుకూరులో జిల్లా కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు, అక్కడ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.