కడప కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, దళితులకు అన్యాయం జరగకుండా చూడటమే విజిలెన్స్ కమిటీ లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ నచికేత్తో కలిసి నిర్వహించిన సమావేశంలో, అట్రాసిటీ బాధితులకు త్వరితగతిన పరిహారం, న్యాయం అందాలని, దళితుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ కేసుల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, సంక్షేమ హాస్టళ్లపై నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు.