ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సంపాదించి పెట్టే శాఖల్లో ఒకటైన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ కడప జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయింది. 2025 ఏప్రిల్ ఒకటి నుంచి నవంబర్ వరకు రూ.191 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. ప్రభుత్వం 203 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. ఆదాయ లక్ష్యసాధనలో కడప జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలోఉండిపోయింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోవడం ప్రధాన కారణoగా పేర్కొనవచ్చు.