కడప నగరంలోని 38వ డివిజన్ యానాది కాలనీలో
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. అవ్వాతాతలు, నిస్సహాయుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పెంచిన పెన్షన్లతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని ఆమె తెలిపారు.