కడప జిల్లాలో వ్యవసాయాన్ని ఆధునికీకరించి, రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో 'స్మామ్' పథకం సమర్థవంతంగా అమలు జరుగుతోందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యంత్రాల వాడకం వల్ల కూలీల ఖర్చు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు రాష్ట్ర ప్రభుత్వ 'ఈ-సీడ్' పోర్టల్ (https://eseed.ap.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.