కడప నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ సి.ఐ. సురేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని ఆయన కోరారు.