జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, బుధవారం ప్రభుత్వ ఐటీఐలో విద్యార్థులకు సైబర్ నేరాలపై తాలూకా సీఐ నరసింహరాజు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా మోసాలు, ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దని, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని ఆయన సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా డయల్ 100ను సంప్రదించాలని సీఐ కోరారు.