పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, గురువారం సాయంత్రం కడప నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంగీత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్. పి కె. ప్రకాష్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, పండుగల సమయంలో ప్రజలు ఇళ్లలో ఉన్నప్పుడు పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటూ నిరంతరం ప్రజల పరిరక్షణకు అంకితమవుతారని తెలిపారు.