సత్యసాయి జిల్లా కదిరిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాల మండలం రామన్నూతలపల్లెకు చెందిన అశోక్(26) మృతి చెందాడు. బెంగళూరు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.